మన్మథుడు నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “మన్మథుడు-2”. ఈ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా… కీర్తి సురేష్, సమంత అతిధి పాత్రలలో నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ని నిన్న విడుదల చేశారు. ఇందులో పెళ్ళికాని మధ్య వయస్కుడిగా నాగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. డైలాగ్స్ కూడా ఫన్నీగా ఉన్నాయి. అయితే చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా ఒక్కరిని కూడా టీజర్లో చూపించకపోయే సరికి నెటిజన్స్ ఇదే విషయంపై రాహుల్ రవీంద్రన్ ను ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. దీనిపై క్లారిటీ ఇచ్చిన రాహుల్.. టీజర్లో రకుల్ని చూపించకపోవడానికి కారణం ఆమె కోసం సపరేట్గా ఓ టీజర్ కట్ చేశాం. అందుకే రకుల్ని టీజర్లో చూపించలేదు అని తెలిపారు. మన్మథుడు 2 చిత్రం ఆగస్ట్ 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే. రావు రమేశ్, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్, దేవదర్శిణి ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. మనం ఎంటర్ప్రైజస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయ్కామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నాగార్జున స్వయంగా జెమిని కిరణ్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా పని చేస్తున్నారు.
previous post