telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్రజల్లో విద్వేషాలు పెంచుతున్నారు: రాహుల్

rahul gandhi to ap on 31st

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మేకిన్ ఇండియా నినాదం ప్రచారానికే పరిమితమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాంగ్‌పూర్‌లో మాట్లాడిన రాహుల్.. మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్రజల్లో విద్వేషాలు పెంచుతున్నారని మండిపడ్డారు.

నిరుద్యోగాన్ని పారదోలి యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ధ్యాస అటు మోదీకీ, ఇటు కేజ్రీవాల్‌కు ఇద్దరికీ లేకుండా పోయిందన్నారు. అధికారం కోసమే వారి పోరాటమని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని అన్నింటినీ అమ్మేస్తుంటారని, ఏదో ఒక రోజు తాజ్‌మహల్‌నూ అమ్మేస్తారని దుయ్యబట్టారు. ఆగ్రాకు ఇప్పటి వరకు ఒక్క ఫ్యాక్టరీ కూడా రాలేదని రాహుల్ అన్నారు.

Related posts