telugu navyamedia
రాజకీయ వార్తలు

ఇమేజ్ పెంచుకోవడంపైనే మోదీ ఫోకస్: రాహుల్

Rahul gandhi congress

ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని మోదీ తన ఇమేజ్ ను పెంచుకోవడం పైనే పూర్తి ఫోకస్ పెట్టారని అన్నారు. సరిహద్దుల్లో చైనా దూకుడుపై ట్వట్టర్ ద్వారా రాహుల్ స్పందిస్తూ… ఈ సమస్యను ప్రపంచ దృష్టి కోణం నుంచి చూడాలని సూచించారు. ఉమ్మడి వ్యూహంతో ముందుకు సాగాలని అన్నారు. వన్ మేన్ ఇమేజ్ అనేది జాతీయ దృష్టికి ప్రత్యామ్నాయం కాదని చెప్పారు.

రెండో సారి అధికారంలోకి వచ్చేందుకు ‘స్ట్రాంగ్ మేన్’ అనే కృత్రిమ ఇమేజ్ ను మోదీ సృష్టించుకున్నారని చెప్పారు. ఈ ఇమేజ్ మోదీకి బలమని, ఇదే సమయంలో ఇండియా వీక్ నెస్ కూడా అదేనని అన్నారు.ఒక పక్కా ప్రణాళిక లేకుండా చైనాను ఢీకొనలేమని రాహుల్ అన్నారు. కేవలం అంతర్జాతీయ దృష్టి కోసం నుంచి ఈ సమస్యను ఎదుర్కోవాలని పేర్కొన్నారు.

Related posts