telugu navyamedia
రాజకీయ వార్తలు

లాక్‌డౌన్ తాత్కాలిక చర్య మాత్రమే: రాహుల్

Rahul gandhi congress

కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ తాత్కాలిక చర్య మాత్రమేనని కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ రోజు వీడియో యాప్‌ ద్వారా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లాక్‌డౌన్‌తో కరోనా వైరస్‌ వ్యాప్తిని పూర్తిగా కట్టడి చేయలేమని అన్నారు.

మనం వినియోగిస్తోన్న తాత్కాలిక పద్ధతి మాత్రమే. లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే కరోనా వైరస్‌ మళ్లీ విజృంభించి తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంది. కొన్ని రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించడమనేది కరోనాకు శాశ్వత పరిష్కారం కాదు’ అని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి  పరిస్థితి రాకుండా ఉండాలంటే కరోనా నిర్ధారణ పరీక్షలను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

మనముందున్న ఒకే ఒక మార్గం ఇదే. దేశంలో రెండు జోనులు ఏర్పాటు చేయాలి.. ఒకటి హాట్‌స్పాట్‌, మరొకటి నాన్‌ హాట్‌స్పాట్‌ జోన్. ఆ తర్వాత ఆయా జోనుల్లో పలు చర్యలు తీసుకోవాలని చెప్పారు.ర్యాండమ్‌ పద్ధతిలో కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలి. కరోనా పరీక్షలు వ్యూహాత్మకంగా జరగట్లేదు. కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Related posts