telugu navyamedia
రాజకీయ వార్తలు

అమిత్ షా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన రాహుల్

Rahul gandhi congress

ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోనే ప్రతి రోజు ఎక్కువగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో మన దేశం కరోనాపై పక్కా ప్రణాళికతో పోరాడుతోందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న చేసిన వ్యాఖ్యలపై రాహుల్ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు.

పక్కా ప్రణాళికతో మోదీ ప్రభుత్వం చేసిన పోరాటం వల్ల దేశం అగాధంలోకి కూరుకుపోయిందని రాహుల్ దుయ్యబట్టారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీడీపీ 24 శాతం పడిపోయిందని రాహుల్ విమర్శించారు. 12 కోట్ల ఉద్యోగాలు పోయాయని అన్నారు. మరో 15.5 లక్షల లోన్లు నిరర్థకంగా మారిపోయాయని చెప్పారు. ఇంత జరుగుతున్నప్పటికీ కేంద్రం మీడియాకు మాత్రం ‘ఆల్ ఈజ్ వెల్’ అనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

Related posts