ఏపీ రాజకీయాల్లో వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఇటీవల ఆయన వైసీపీ సర్కారునుద్దేశించి పలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం పరిధిలో నిర్వహించే అబివృద్ధి, ప్రారంబోత్సవాలు చేయడానికి సీఎంకు పెద్దపీట వేస్తారు. కానీ నర్సాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవానికి నిర్మలా సీతారామన్కు రఘురామకృష్ణరాజు ఆహ్వానం పంపారు.
నర్సాపూర్ అసెంబ్లీ పరిధిలోని మైనపువాని లంకలో నిర్మలా సీతారామన్ కేటాయించిన 4 కోట్ల రూపాయల నిధులతో భవనాలు నిర్మించారు. అయితే ఈ భవనాల ప్రారంభానికి ఆమెను ఆహ్వానించారు. అక్టోబర్ నెలలో ఒక రోజు నియోజకవర్గంలో పర్యటించాలని కేంద్రమంత్రిని రఘురామకృష్ణరాజు కోరారు. అంతేకాదు విపత్తు నిర్వహణ నిధుల నుంచి కోతకు గురవుతున్న తీర ప్రాంతంలో రివిట్మెంట్ పనులకు రు. 200 కోట్ల నిధులు కేటాయించాలని కోరారు.
ఓటమి విషయమై ఎవరినీ తప్పుబట్టడం లేదు: దేవెగౌడ