telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సీఎం జగన్‌కు రఘురామ కృష్ణరాజు మరో లేఖ

Raghuramakrishnaraju ycp mp

ఏపీ సీఎం జగన్ కు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మరో లేఖ రాశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగే ఆగస్టు 5న ఏపీలోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు. రామాలయ నిర్మాణానికి చేస్తున్న భూమి పూజ భారతదేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని తెలిపారు.

రాష్ట్రంలోని దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోని 24 వేల దేవాలయాల్లో పూజలు, హోమాలు, వేద పఠనం నిర్వహించాలని ఆ లేఖలో కోరారు. అంతేకాదు, ప్రధాన మంత్రి చేస్తున్న భూమి పూజ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ చానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని పేర్కొన్నారు. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడం ప్రజల చిరకాల వాంఛ అని లేఖలో వివరించారు.

Related posts