ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు అనుమతిని కోరుతూ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. ఈనెల 24వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తాను అమరావతిలో పర్యటిస్తానని లేఖలో పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పర్యటిస్తానని లేఖలో స్పష్టం చేశారు.
కొద్ది రోజుల నుంచి రఘురాజు సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతులకు ఆయన బహిరంగంగానే సంఘీభావం ప్రకటిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజధాని అమరావతిలోనే కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు. అమరావతి రైతులకు కోర్టుల్లో తప్పకుండా న్యాయం జరుగుతుందని చెబుతున్నారు.
సీఎంపై టీడీపీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు: వైసీపీ