telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నా భ‌ర్త‌కు ఏం జరిగినా సీఎం జగన్‌ బాధ్యత వహించాలి

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం చాలా హాట్ టాపిక్ గా మారింది. ఇక నిన్ననే రఘురామకృష్ణరాజును గుంటూరు జైల్లో ఉంచారు సీఐడీ అధికారులు. అయితే తన భర్త అరెస్ట్ పై రఘురామకృష్ణరాజు భార్య ర‌మ‌.. మీడియాకు ఓ వీడియోను విడుద‌ల చేసారు. అందులో ”నా భ‌ర్త‌కు ప్రాణ‌హాని ఉంద‌ని ఆరోపించారుఆమె.. నా భ‌ర్త‌కు ఏం జరిగినా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్‌, సీఐడీ బాధ్యత వహించాల‌న్నారు.. ఈ రాత్రి జైలులో ఆయ‌న‌పై దాడి చేస్తారనే సమాచారం ఉందంటూ అనుమానాలు వ్య‌క్తం చేసిన ఆమె.. వైసీపీ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేద‌ని పేర్కొన్నారు.. ఇక‌, సీఐడీ ఆఫీసులో పోలీసులు తన భర్తను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts