telugu navyamedia
సినిమా వార్తలు

దిల్ రాజుకు దర్శకేంద్రుడి శుభాకాంక్షలు

Dil-raju

దిల్ రాజు పంపిణీ రంగం నుండి సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా ద‌ర్శ‌కేంద్రుడు కె రాఘ‌వేంద్ర‌రావు కొద్ది సేప‌టి క్రితం త‌న ట్విట్ట‌ర్ ద్వారా దిల్ రాజుకి శుభాకాంక్ష‌లు తెలిపారు. “తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో నువ్వు చేసిన 20 ఏళ్ళు ప్ర‌యాణంలో ఎన్నో జ్ఞాపకాలు, మ‌రెన్నో విజ‌యాలు ఉన్నాయి. రాబోవు రోజుల‌లో నువ్వు మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని కోరుకుంటున్నాను” అని రాఘ‌వేంద్ర‌రావు ట్వీట్ చేశారు. రాజు పంపిణీ రంగం నుండి సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి దిల్ రాజు ఒక్కో మెట్టూ ఎక్కుతూ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అద్భుత ప్ర‌యాణం చేశాడు. 1999లో అర్జున్ నటించిన ఒకే ఒక్కడు చిత్రంతో వెంకటేశ్వర ఫిలింస్ పంపిణీ సంస్థ ప్రారంభించాడు. ఆ త‌ర్వాత మంచి చిత్రాలు నిర్మించారు. గ‌త‌ 16 ఏళ్లలో 32 చిత్రాల్ని నిర్మించారు. 2017లో దిల్ రాజు సంస్థ ద్వారా 6 సినిమాలు వ‌చ్చాయి . 2018లో మూడు చిత్రాలు, ఇక 2019లో నాలుగు చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. రెండు ద‌శాబ్ధాల ప్ర‌యాణంలో ఎన్నో ఎత్తు ప‌ల్లాలు చూసిన దిల్ రాజు జూలై 24న‌ మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి ఈ ప్ర‌యాణంలో త‌న‌కి స‌పోర్ట్‌గా నిలిచిన వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Related posts