కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా ఓ వైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటే.. మరోవైపు పేదలకు అండగా నిలుస్తూ ఉదారత చాటుకుంటున్నారు సినీ ప్రముఖులు. పలువురు సినీ సెలబ్రిటీలు కరోనా ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. తాజాగా కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఓ పాత్రికేయుడికి సాయం అందించడానికి ముందుకు వచ్చారు. ఓ పాత్రికేయుడి తల్లి పార్థివదేహాన్ని కేరళ నుండి తమిళనాడుకి రప్పించడానికి సహకారం అందించాలని కేరళ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ‘‘ఇటీవల వైద్యం నిమిత్తం తిరువనంతపురం వచ్చిన అశోక్ అనే పాత్రికేయుడు అమ్మగారు అకాల మరణం పొందారు. ఆమె పార్థివ దేహాన్ని తమిళనాడుకు తీసుకురావాల్సి ఉంది. అయితే సదరు పాత్రికేయుడు అశోక్ ఆసుపత్రికి చెల్లించాల్సిన లక్షన్నర రూపాయలను చెల్లించలేని స్థితిలో ఉన్నారు. అతని తల్లి భౌతిక దేహాన్ని పంపడానికి అనుమతి ఇవ్వండి. ఆసుపత్రికి చెల్లించాల్సిన డబ్బును ఒకట్రెండు రోజుల్లో నేనే చెల్లిస్తాను’’ అని లారెన్స్ పేర్కొన్నారు.
previous post
next post