శ్రీలంక రాజధాని కొలంబోలో ఈరోజు ఉదయం వరుస బాంబు పేలుళ్ల జరిగిన సంగతి తెలిసిందే. చర్చిలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకుని చర్చిలో ప్రార్థనలకు వచ్చినేవారే లక్ష్యంగా ముష్కరులు దాడులకు తెగబడ్డారు. మొత్తం ఆరు చోట్ల బాంబు పేలుళ్లు జరిగినట్టు సమాచారం. ఈ పేలుళ్లలో ఇప్పటి వరకు 129 మంది మృతిచెందినట్లు సమచారం. 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తుంది. అక్కడే సిన్నామన్ గ్రాండ్ హోటల్ లో స్టే చేసిన రాధికా ఈ ఘటన జరిగే కొద్దీ నిమిషాల ముందు ఆమె ఈ హోటల్ ను ఖాళీ చేసి వెళ్లిపోయారు. దాని తో ప్రాణాపాయం నుండి తప్పించుకోగలిగారు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న రాధికా షాకింగ్ గా ఉందని నేను హోటల్ ను ఖాళీ చేసిన కొద్దీ సేపటికే బ్లాస్టింగ్ జరిగిందని తెలియజేసింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.45 ప్రాంతంలో కొలంబోలోని ఒక చర్చితోపాటు మూడు ఫైవ్ స్టార్ హోటళ్లలో బాంబులు పేలాయి. కొలంబోలోని సెయింట్ ఆంటోనీ, నెగోంబో పట్టణంలోని సెయింట్ సెబాస్టియన్, బాట్టికలోవాలోని మరో చర్చితో పాటు శాంగ్రిలా, సిన్నామన్ గ్రాండ్, కింగ్స్బరి హోటళ్లలో పేలుళ్లు సంభవించాయి. తాజాగా మరో పేలుడు కూడా సంభవించింది.. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. దీనితో ఆ దేశప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ప్రపంచదేశాలు శ్రీలంకకు అండగా ఉంటామని ఇప్పటికే ప్రకటించాయి.
నన్ను అక్రమ సంబంధం పెట్టుకునేవాడిగానే చూస్తున్నారు… హీరో ఆవేదన