ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ అనే పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అలాగే ఈ మధ్యే ఫిబ్రవరి 14న ‘గ్లింప్స్ ఆఫ్ రాధే శ్యామ్’ మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి మరో సర్ ప్రైజ్ విడుదల చేసింది ఈ చిత్ర యూనిట్. శివరాత్రి సందర్బంగా ఓ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో ప్రభాస్, పూజ మంచులో పడుకొని కన్పిస్తున్నారు. అయితే గతంలో ఈ సినిమానుండి వాచిన పోస్టర్లు కాపీ అంటూ అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే జులై 30న ‘రాధే శ్యామ్’ థియేటర్లోకి రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్ పాత్రలో కనిపించనుంది. పాన్ ఇండియాగా రూపొందుతున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీత మందిస్తున్నాడు. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ సినిమాలతోను బిజీగా ఉన్నాడు.
previous post
next post
రాజధానిని కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉంది: సుజనా చౌదరి