telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

జూబ్లీహిల్స్ పీఎస్ లో విచారణకు హాజరైన పీవీపీ

PVP ycp

కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. తన వద్ద మేనేజర్ గా పని చేసిన తిమ్మారెడ్డి అనే వ్యక్తిని గత సెప్టెంబర్ 16న పీవీపీ కిడ్నాప్ చేశారంటూ ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పీవీపీని ఏ1 నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు.

బంజారాహిల్స్ లో ఓ విల్లాకు సంబంధించిన గొడవలో ఆ విల్లా యజమాని పీవీపీపై ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆయనను ప్రశ్నించేందుకు వెళ్లిన పోలీసులపై పీవీపీ కుటుంబసభ్యులు కుక్కలను వదిలారు. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టులో బెయిల్ పొందారు. అయితే, ఈ రెండు కేసుల విచారణకు రావాలని పోలీసులు సూచించడంతో  ఆయన ఈరోజు పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు.

Related posts