కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ వాయిదా వేయడాన్ని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సమర్థించింది. ఒలింపిక్స్కంటే జీవితమే అన్నికంటే ప్రథమమని ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లో పాల్గొని స్వదేశానికి వచ్చినప్పటి నుంచి సింధు స్వీయ నిర్బంధంలో ఉంది.
“ఒలింపిక్స్ను వాయిదా వేయడం మంచి నిర్ణయం. ఎందుకంటే మరో అవకాశం లేదు. కరోనా వల్ల కొందరు ప్రజలు చనిపోతున్నారు. జీవితమే ప్రథమం. టోర్నీలను సైతం రద్దు చేస్తుండడం మంచి విషయం. ప్రతి వారం, ప్రతి రోజు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నది. ఒలింపిక్స్ వాయిదా పడ్డాయని నాకు కొందరు నిరాశగా చెబుతున్నారు. అయితే జీవితమే ప్రథమం, ఆ తర్వాతే ఒలింపిక్స్ అని సింధు తెలిపింది.