ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ తెలుగు తేజం పీవీ సింధు అమరావతిలో ఈ రోజు ఏపీ సీఎం జగన్ ను కలుసుకున్నారు. తన తల్లిదండ్రులతో కలసి సచివాలయానికి వచ్చిన పీవీ సింధు ముఖ్యమంత్రిని కలిసింది. ఈ సందర్భంగా . బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్లో తాను సాధించిన బంగారు పతకాన్ని సీఎం జగన్కు ఆమె చూపించింది. సింధును శాలువా కప్పి సీఎం జగన్ సత్కరించారు. ఆమెకు అభినందలను తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. సింధు వెంట ఆమె తల్లిదండ్రులతో పాటు మంత్రి అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు ఉన్నారు.
అనంతరం పీవీ సింధు మీడియాతో మాట్లాడుతూ వైజాగ్ లో అకాడమీ నొలకొల్పేందుకు ఐదు ఎకరాలు కేటాయిస్తామని సీఎం హామీయిచ్చినట్టు వెల్లడించింది. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించింది. పద్మభూషణ్ పురస్కారానికి తన పేరును పరిశీలిస్తుండటం గర్వంగా ఉందని తెలిపింది. ఇటీవల జరిగిన ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పీవీ సింధు స్వర్ణం నెగ్గి సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.