telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కెసిఆర్ కేబినెట్ లో మరో మంత్రికి కరోనా

puvvada ajay

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 4 లక్షలు దాటేశాయి. మామూలు ప్రజలతో పాటు రాజకీయ నాయకులపై కూడా కరోనా విరుచుకుపడుతోంది. తాజాగా తెలంగాణ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. త‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌ని, ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్టు మంత్రి అజ‌య్ కుమార్ వెల్ల‌డించారు. తాను ఆరోగ్యంగా ఉన్నాన‌ని, ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాల‌ని, త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని మంత్రి పువ్వాడ విజ్ఞ‌ప్తి చేశారు. కాగా మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్‌కు ఫస్ట్ వేవ్ లోనూ కరోనా బారిన పడ్డారు.

Related posts