డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్గా అల్లు అర్జున్ పాత్ర ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కొన్ని రోజుల క్రితం మారేడుపల్లి ఏజెన్సీ ప్రాంతంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంది. ఇక తదుపరి షెడ్యూల్ గా కేరళ వెళ్లనుందట పుష్ప బృందం. అయితే సినిమాపై బన్నీ ఫ్యాన్స్ తో పాటు దాదాపు తెలుగు ప్రేక్షకులందరికి కూడా భారీ అంచనాలున్నాయి. సుకుమార్ దర్శకత్వం కావడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో సుకుమార్ అనూహ్య నిర్ఱయం తీసుకున్నాడట. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాను కూడా రంగస్థలం తరహాలో ప్రత్యేక సెట్ వేసి షూట్ చేయాలని సుకుమార్ భావిస్తున్నాడట. అటవీ ప్రాంతాల్లో షూటింగ్ స్వీడ్గా జరగకపోవడంతో ఇలా సెట్ ఆలోచన చేస్తున్నాడని టాక్. రంగస్థలం కు కూడా ఇలాగే హైదరాబాద్లో ప్రత్యేకంగా విలేజ్ సెట్ వేసి షూటింగ్ చేయడం తెలిసిందే.
ఎదవ పుట్టుక… అలా పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది : పూరీ