పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. ఈ చిత్రంలో రామ్ హీరోగా నటిస్తుండగా నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యంలో విడుదలైన నాలుగు పాటలకు మంచి స్పందన వచ్చింది. అలాగే టీజర్, ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 18న విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని ఏ సర్టిఫికెట్ పొందింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పూరీ మాట్లాడుతూ `టెంపర్` తర్వాత సరైన సక్సెస్ లేకపోవడంతో `ఇస్మార్ట్ శంకర్`పై ఎక్కువ ఫోక్స్ పెట్టానని, ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో రెగ్యులర్ కథలకు భిన్నంగా కథను రాసుకున్నానని, ముందు రామ్తో సినిమా అనుకున్న తర్వాత చేతిలో కథ లేదని తెలిపారు పూరి. అదే సమయంలో `గుడ్ బాయ్ పాత్రలు చేసి విసుగొచ్చేసింది సార్! నన్ను బ్యాడ్బాయ్గా చూపించండి` అని రామ్ అనడంతో పూరి, రామ్ కలిసి కూర్చుని కథను తయారు చేసుకున్నామని తెలిపారు. అదే సమయంలో బాలకృష్ణతో సినిమా మళ్లీ సినిమా ఎప్పుడు చేస్తారనే ప్రశ్న ఎదురవగా… “బాలకృష్ణగారు చేయని జోనర్ లేదు. ఆయన కోసం కొత్త కథ రాయాలనిపిస్తుంది. కథ రెడీ కాగానే ఆయన్ని వెళ్లి కలుస్తాను” అంటూ పూరి చెప్పుకొచ్చాడు.
previous post