ప్రపంచంలోని అన్ని దేశాలతో పాటుగా మన దేశాన్ని కూడా కరోనా కబళిస్తుంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో దీని ప్రభావం కొంచెం కొంచెం తగ్గుతుంటే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి మారదలేదు.. మరోవైపు.. చలి తీవ్రత మాటున కోవిడ్ మళ్లీ పడగవిప్పుతుందనే హెచ్చరికలు లేకపోలేదు.. దీంతో.. ఆయా రాష్ట్రాల్లో జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.. ఇక, పంజాబ్లో కోవిడ్ కేసుల నమోదు కొనసాగుతూనే ఉంది.. ఈ నేపథ్యంలో.. నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం అమరేందర్ సింగ్.. ఇటీవల డిసెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది పంజాబ్ ప్రభుత్వం.. ఇవాళ ఉన్నతాధికారులతో సమావేశమై సీఎం అమరేందర్ సింగ్.. కేసుల తీవ్రతపై చర్చించారు.. కొత్త కేసులు తగ్గుముకం పట్టకపోవడంతో.. నైట్ కర్ఫ్యూను జనవరి 1వ తేదీ వరకు పొడిగించారు. ఈ కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.. ఈ సమయంలో పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి, అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. చూడాలి మరి ఈ చర్య కరోనా కట్టడికి పనికాస్తుందా… లేదా అనేది.
previous post