telugu navyamedia
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ ఓటమి పాలైతే నాదే బాధ్యత: సీఎం అమరీందర్

amarinder singh

తుది విడతలో భాగంగా ఈ నెల 19న పంజాబ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే అందుకు పూర్తి బాధ్యత వహిస్తానని అన్నారు. పంజాబ్‌ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే అందుకు బాధ్యతగా తాను రాజీనామా చేస్తానని అమరీందర్ సింగ్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరాజయం పాలైతే అందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇందుకు బాధ్యత వహించాలన్నారు.

పార్టీ గెలుపు, ఓటములకు మంత్రులు, శాసనసభ్యులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అధిష్ఠానం ఎప్పుడో చెప్పిందని గుర్తు చేశారు. పార్టీ ఓడిపోతే నేనైతే ఆ బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మరోవైపు ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అమరీందర్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.

Related posts