విదేశాల్లో చదువుతున్న కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్ కుమార్ పెద్ద కుమార్తె ధృతి కంఠీరవ మైదానంకు చేరుకున్నారు. తండ్రి హఠాన్మరణం సోకసంద్రంలో ఆమె షాక్లో ఉన్నారు. పై చదువులకోసం ధృతి రెండు నెలల క్రితమే అమెరికాకు వెళ్లారు.
తండ్రి పార్ధివదేహం వద్ద తల్లిని హత్తుకొని గుండెలు పగిలేలా ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. చివరిసారిగా తండ్రి, చేయి పట్టుకొని, తలను నిమురుతున్న దృశ్యాలు చూసినవాళ్లకి కన్నీళ్ళు పెట్టిస్తున్నాయి.
తండ్రి పునీత్ కుమార్ ఆఖరి చూపుకోసం ధృతి ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. బెంగళూరు విమానం మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరింది. సాయంత్రం 4.15 గంటలకు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా బెంగళూరు కంఠీరవ స్డేడియంలోచేరుకున్నారు.
ఢిల్లీలో ధృతి విమాన మార్పునకు కర్ణాటక భవన్ అధికారులు సహకరించినట్లు సమాచారం. ధృతి బెంగళూరు వెళ్లేందుకు అధికారులు బోర్డింగ్ పాస్ సిద్ధం చేశారు. నటుడు పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియల వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది.
ఈరోజు సాయంత్రం (అక్టోబర్ 30) ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి ముందుగా ప్రకటించారు. అయితే పునీత్ పెద్ద కుమార్తె అమెరికా నుంచి రావడం ఆలస్యం అవడంతో పునీత్ అంత్యక్రియలు వాయిదా వేశారు.
రొమాంటిక్ పాత్రలో నటించబోతున్నా : నిహారిక కొణిదెల