బుల్లితెర బిగ్ రియాలిటీ షో సక్సెస్ ఫుల్గా పదివారాలు పూర్తి చేసుకొని పదకొండో వారంలోకి అడుగుపెట్టింది. గత వారం రవికృష్ణ బిగ్ బాస్ హౌజ్ని వీడగా, ప్రస్తుతం ఇంట్లో తొమ్మిదిమంది సభ్యులు ఉన్నారు. అయితే ఈ వారం ఇంటి సభ్యులు ఇమ్యూనిటీని పొందటం కోసం బాటిల్ ఆఫ్ మెడాలియన్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. వారం చివరిలో ఎవరో ఒకరికి మాత్రమే ఇది దక్కుతుందని అన్నారు. ఈ మెడల్ దక్కాలంటే తమలో పోటీ తత్వాన్ని నిరూపించుకోవలసి ఉంటుందని పేర్కొన్నారు బిగ్ బాస్. ఇక సోమవారం నామినేషన్ ప్రక్రియ కావడంతో ‘రాళ్లే రత్నాలు’ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో ఆకాశం నుండి 20, 50, 100, 200 విలువ కలిగిన రాళ్ల వర్షం కురుస్తోంది.. ఇంటి సభ్యులు ఆ రాళ్లను సొంతం చేసుకుని జమ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా ఎవరు ఎక్కువ విలువ కలిగిన రాళ్లను సొంతం చేసుకుంటే.. వాళ్లే ఈ వారం నామినేషన్స్ నుండి తప్పించుకుంటారు. తక్కువ ఉన్నవాళ్లు నామినేట్ అవుతారు. శ్రీముఖి కెప్టెన్గా ఉన్న కారణంగా ఆమెకి టాస్క్లో మినహాయింపు ఇస్తూ సంచాలకురాలిగా వ్యవహరించాలని బిగ్ బాస్ తెలిపారు. టాస్క్ ప్రారంభమైన తర్వాత గేమ్ రంజుగా సాగింది. ఇప్పటికే రాహుల్ నామినేట్ కాగా, ఆయనతో పాటు పునర్నవి, మహేష్, వరుణ సందేశ్ నామినేట్ అయ్యారు.
మంగళవారం జరిగిన ఎపిసోడ్ 73లో అలుపు లేకుండా టాస్క్ ఆడారు ఇంటి సభ్యులు. ఫిజికల్ టాస్క్ అయినప్పటికి ఎలాంటి గొడవలు లేకుండానే టాస్క్ ముగిసింది. రాళ్ళు కురుస్తున్న సమయంలో వరుణ్ ముక్కుకి బుట్ట తగిలి బ్లీడింగ్ కావడం, వితికా రాళ్ళని బాబా భాస్కర్ గుంజుకోవడానికి ప్రయత్నించే సమయంలో ఆమె ఫైర్ కావడం వంటివి జరిగాయి. అయితే వితికా అరుస్తున్న సమయంలో వరుణ్ ఆమెని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. ఇది ఫిజికల్ టాస్క్ ఇలానే ఉంటుంది. ఆడలేకపోతే పక్కకి వెళ్లి కూర్చో అని గట్టిగా అరిచాడు. వాళ్ళని అంటుంటే నీ కెందుకు కోపం వస్తుంది.. మాట్లాడితే గేమ్ మానేయ్ అంటూ వరుణ్పై అలిగింది వితికా. కొద్ది సేపటి తర్వాత ఆమె దగ్గరకి వచ్చి .. నా మీద ఫీల్ అయ్యావా అంటూ వితికాను గట్టిగా హగ్ చేసుకున్ననాడు వరుణ్. ‘అబ్బా.. వదులు వరుణ్.. ఓవరాక్షన్ చేయకు వదులు’ అంటూ బుంగమూతి పెట్టింది వితికా. ఇలా కొద్ది సేపటి వరకు వీరిద్దరి రొమాంటిక్ మూడ్లో ఉండిపోయారు. అయితే 11వ వారంలో బిగ్ బాస్ ప్రేమజంట రాహుల్, పునర్నవి నామినేషన్లో ఉండడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.