హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆస్తి కోసం సవతి తల్లిని కానిస్టేబుల్ దారుణంగా చంపాడు. తండ్రి చనిపోయి 2 నెలలు గడవక ముందే ఆస్తి కోసం సవతి తల్లిని అతి దారుణంగా నరికాడు. మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయబస్తీలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకివెళితే.. మాదన్నపేట్కు చెందిన యాదయ్యకు ఇద్దరు భార్యలు.
ఈ మధ్య కాలంలోనే యాదయ్య అనారోగ్యంతో చనిపోయాడు. తండ్రి శ్రీకాంత్కు బీహెచ్ఈఎల్ టౌన్షిప్లో కోటి రూపాయల విలువ చేసే ఇల్లు, మాదన్నపేటలో మరో ఇల్లు ఇవ్వడం జరిగింది. తండ్రి రెండో భార్యకు ఇచ్చిన ఆస్తి తనకే కావాలని మంగళవారం ఉదయం మాదన్నపేట్లో ఉండే సవతి తల్లి ఇంటికి వచ్చి ఇద్దరు పిల్లల కళ్లలో కారం చల్లి సవతి తల్లి సుకన్య మెడను కోసి అతి దారుణంగాచంపేశాడు.