telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ నిర్మాతకు రెండోసారీ కరోనా పాజిటివ్‌… ఆందోళనలో కుటుంబ సభ్యులు

khareem

బాలీవుడ్‌ నిర్మాత కరీమ్‌ మొరానీకి రెండోసారి నిర్వహించిన వైద్య పరీక్షల్లోనూ కరోనా పాజిటివ్‌గా తేలింది. ముంబైలోని నానావతి ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తాజాగా మ‌రోసారి కరీంకు టెస్ట్‌లు చేసిన వైద్యులు అత‌డు ఇంకా కరోనా బారి నుంచి కోలుకోలేదని తెలిపారు. తొలుత కరీమ్‌ కుమార్తెలు జోవా, షాజాలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. విదేశాల నుంచి వచ్చిన కూతురి ద్వారా కరీంకు కరోనా సోకినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో కరీం మాత్రం ఇంకా వైరస్‌ బారి నుంచి కోలుకోలేదని వైద్యులు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన కూతురి ద్వారా కరీంకు కరోనా సోకినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో కరీం మాత్రం ఇంకా వైరస్‌ బారి నుంచి కోలుకోలేదని వైద్యులు వెల్లడించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది.కాగా ఇప్పటికే కరీం(60)కు రెండుసార్లు హార్ట్‌ ఎటాక్‌ వచ్చిందని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనకు బైపాస్‌ సర్జరీ కూడా నిర్వహించారని.. కరోనా ఆయనపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షారుక్‌ఖాన్‌ హీరోగా నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’(2013), ‘దిల్‌వాలే’ (2015) చిత్రాలకు కో ప్రొడ్యూసర్‌గా, ‘రా.వన్‌’(2011), ‘హ్యాపీ న్యూఇయర్‌’ (2014) చిత్రాలకు అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించి.. బాద్‌షా సన్నిహితుడిగా గుర్తింపు పొందాడు.

Related posts