లేడీ సూపర్ స్టార్ నయనతార, ప్రభుదేవా కాంబినేషన్ మరోసారి వెండితెరపైకి రానుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా నిర్మాత స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. రెండేళ్ల క్రితం ప్రభుదేవా దర్శకత్వంలో విశాల్, కార్తి హీరోలుగా ‘కరుప్పు రాజా వెళ్లై రాజా’ అనే సినిమా స్టార్ట్ అయ్యింది. అనివార్య కారణాలతో సినిమా ఆగిపోయింది. ఈశ్వరి కె.గణేశ్ ఈ చిత్రానికి నిర్మాత. తాజాగా ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుందని ఇందులో ప్రభుదేవా, నయనతార కూడా నటిస్తారని వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై నిర్మాత ఈశ్వరి కె.గణేశ్ వివరణ ఇచ్చారు. ‘‘ ‘కరుప్పు రాజా వెళ్లై రాజా’ చిత్రంలో ప్రభుదేవా, నయనతార కలిసి నటిస్తారని వినపడుతున్న వార్తల్లో నిజం లేదు. ‘కరుప్పు రాజా వెళ్లై రాజా’ చిత్రం అనివార్య కారణాలతో ఆగిపోయింది. ఆ సినిమాను పూర్తి చేయాలని ఉద్దేశం నాకు ఇప్పుడు లేదు’’ అన్నారు.
previous post
next post