సినీనటుడు, నిర్మాత బండ్ల గణేష్ మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు. తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన వీరిద్దరు హాయిగా నవ్వుతూ ఫోటోకు ఫోజులిచ్చారు. ఆ ఫోటోను తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసిన బండ్ల గణేష్… చాలాకాలం తర్వాత రోజా గారిని కలిశానని.. ఆమె కెరీర్ మరింత విజయవంతం కావాలని, ఆమెకు ఆరోగ్య, ఐశ్వర్యాలు లభించాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. కొంతకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద రోజా వ్యాఖ్యల నేపథ్యంలో వీరిద్దరి మధ్య మాటలయుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజాకు ఆయనకు మధ్య కొంతకాలం క్రితం టీవీ లైవ్ డిబేట్లో జరిగిన గొడవ అందరికీ తెలిసిందే. ప్రత్యక్ష ప్రసారంలో ఉన్నామన్న సోయి లేకుండా ఇద్దరూ బూతులతో రెచ్చిపోయారు. అప్పటి నుంచి వీరిద్దరికి మాటలు లేవు. అయితే ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ కలిసి ఫోటోలకు ఫోజివ్వడం హాట్ టాపిక్ గా మారింది.
After long time I met @RojaSelvamaniRK god bless with Successful career and good health and wealth💝 pic.twitter.com/gGO4WSBmcE
— BANDLA GANESH. (@ganeshbandla) October 30, 2020