సినీ నిర్మాత అశ్వినీదత్ ఏపీ సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిని జగన్ ప్రభుత్వం సర్వ నాశనం చేసిందని నిర్మాత అశ్వినీదత్ విమర్శించారు. ఇప్పుడు అక్కడ జరగని పాపం లేదు అని.. అక్కడ జరిగే అన్యాయాలను ఊహించలేము అని వ్యాఖ్యానించారు.
హైదరాబాదులో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహానం వ్యక్తం చేశారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తారన్న నమ్మకం తనకు ఉందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయి ఉన్నారన్నారు.
తిరుమలలో ఇప్పుడు జరిగే అన్యాయాన్ని కూడా ఊహించలేమని ఆయన అన్నారు.వెయ్యికాళ్ల మండపం తొలగించినప్పుడు చిన్న జీయర్ స్వామి ఆయనను తీవ్రంగా విమర్శించారు. ఆగమశాస్త్రం ప్రకారమే చంద్రబాబు ఆ మండపాన్ని తొలగించారని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన దగ్గరనుంచి.. ఈ మూడేళ్ల కాలంలో తిరుపతి సర్వనాశనం చేసింది.
ఆ వెంకటేశ్వరస్వామి ఇంకా ఈ పాపాలను ఎందుకు చూస్తున్నాడో అర్థం కావడం లేదు. ఆంధ్ర ప్రదేశ్ లో బలవంతపు మతమార్పిడులు జరుగుతుంటే చిన్న జీయర్ స్వామి ఎందుకు మాట్లాడటం లేదు? ఆయన ఆ మధ్య ఓ స్థూపం ఆవిష్కరణ సందర్భంగా జగన్ను దైవాంశ సంభూతునిగా పొగిడాడు. ఆ మాటలు వినగానే నాకు కడుపు మండిపోయింది.
సమ్మక్క -సారక్క అంటే ప్రజల్లో ఎంతో విశ్వాసం. పొరుగు రాష్ట్రాల ప్రజలూ సమ్మక్క సారక్క దేవతలుగా నమ్ముతారు. వారిని ఆయన దేవతలు కాదనడం బాధ కలిగించింది అని అశ్వినీదత్ చెప్పారు.
టూరిజం బోట్లలో మంత్రులకు వాటాలు: మాజీ ఎంపీ హర్షకుమార్