telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఐసోలేషన్లో ప్రియాంక గాంధీ…

మన దేశంలో మళ్ళీ రోజువారీ కరోనా కేసులు లక్షకు చేరువవుతున్నాయి. అయితే ఇప్పటికే  సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు కరోనా ఎవరిని వదలకుండా అందర్నీ తన చెంత చేర్చుకుంటుంది. అయితే ఇప్పటికే అనేక మంది నేతలు కరోనా బారిన పడ్డారు.  దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.  8 రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నట్టు కేంద్రం గుర్తించింది.  ఇక ఇదిలా ఉంటె, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ భర్త రాబర్డ్ వాద్రాకు కరోనా సోకింది.  ఈ విషయాన్ని ప్రియాంక గాంధీ ట్విట్టర్ ద్వారా తెలిపారు.  రాబర్డ్ వాద్రాకు కరోనా సోకడంతో తాను సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉండగా, ప్రచారాన్ని క్యాన్సిల్ చేసుకున్నట్టు ఆమె ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. అయితే చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

Related posts