ప్రైవేటు ట్రావెల్స్పై రవాణాశాఖ అధికారులు కొరడా ఝులిపించారు. కృష్ణా జిల్లాలో అధిక ఛార్జీలు వసూల్ చేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్పై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్న ప్రైవేటు బస్సులపై అధికారులు 42 కేసులు నమోదు చేశారు.
గత ఐదు రోజులుగా గరికపాడు, పొట్టిపాడు, కీసర టోల్ప్లాజాల వద్ద అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో 6 బస్సులను సీజ్ చేసి, 295 కేసులు నమోదు చేశారు. అధిక ధరలు వసూలు చేసిన ఒక్కో బస్సుకు అధికారులు రూ.25వేల జరిమానా విధించారు. ప్రత్యేక బృందాలతో తనిఖీలు ముమ్మరం చేశామని కృష్ణా జిల్లా డీటీసీ పేర్కొన్నారు.
నిమ్మగడ్డ పై జేసీ సంచలన వ్యాఖ్యలు…