telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎయిర్ పోర్టులో ప్రిన్స్‌ మహేశ్ ఫ్యామిలీ.. పిక్స్‌ వైరల్‌

ప్రిన్స్ మహేష్ బాబు లాక్ డౌన్ అప్పటినుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్ గా ఉంటున్నారు. ప్రతి విషయాన్నీ ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకుంటున్నారు. తాజాగా మహేష్, నమ్రత, సితార, గౌతమ్ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ప్రత్యేక్షమైన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జీన్స్, టీ- షర్ట్ వైట్ మస్కులో ఉన్న మహేష్ సైడ్ బ్యాగ్ వేసుకోగా..సితార, నమ్రత, గౌతమ్ మాస్కులతో బ్యాగులు పట్టుకుని ఎయిర్ పోర్టులోకి ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో అక్కడే ఉన్న కెమెరాలు వీళ్ళ ఫోటోలను క్లిక్ మనిపించాయి. కాగా.. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ సంయుక్త సమర్పణలో రూపొందనున్న ఈ మూవీలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటించనుంది. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరించనుండగా, థమన్ బాణీలు కడుతున్నారు. ఇప్పటికే విడుదలైన ‘సర్కారు వారి పాట’ ప్రీ లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది.

Related posts