telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్న మోడీ…

దేశ ప్రధాని నరేంద్ర మోడీ కరోనా టీకా వేయించుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా కరోనాపై వైద్యులు, శాస్త్రవేత్తలపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకుని దేశాన్ని కరోనా రహితంగా చేయాలని పిలుపునిచ్చారు. “ఎయిమ్స్‌లో కరోనా టీకా ఫస్ట్‌ డోసు తీసుకున్నాను. ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి మన వైద్యులు, శాస్త్రవేత్తలు చేసిన కృషి మరువలేనిది. అర్హత ఉన్న వాళ్లందరూ టీకా వేసుకోవాలి. మనమంతా కలిసి కరోనా రహిత దేశాన్ని నిర్మిద్దాం” అంటూ ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. కాగా..కాగా.. నేటి నుంచి సామాన్యులకు టీకా వేయనున్నారు. 60 ఏళ్ల పైబడిన వారు, 45 ఏళ్ళు పైబడి కోమార్బిట్ సమస్యలు ఉన్న వాళ్లకు టీకా ఇవ్వనున్నారు.

 

Related posts