telugu navyamedia
వార్తలు సామాజిక

అయోధ్య రామ మందిరం పూజారికి కరోనా!

Ayodya temple

ఆగస్టు 5న రామ మందిరానికి భూమి పూజ జరగనున్న నేపథ్యంలో కరోనా కలకలం రేగింది. రామ మందిరం పూజారి ప్రదీప్ దాస్ కరోనా బారినపడ్డారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అంతేకాదు, రామ జన్మభూమి వద్ద భద్రతా విధుల్లో ఉన్న 16 మంది పోలీసులు కూడా కరోనా బాధితులయ్యారు. దాంతో వారు క్వారంటైన్ లోకి వెళ్లారు.

ఆలయ భూమి పూజ కు ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు రానున్న వేళ పూజారికే కరోనా సోకడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమానికి దాదాపు 200 మంది వరకు వీఐపీలు రానున్నట్టు తెలుస్తోంది. పూజారికి కరోనా సోకిన నేపథ్యంలో ఆలయ భూమి పూజ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.

Related posts