రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిది నిమిత్తం హైదరాబాద్ కురానున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ ఎస్ కే జోషి సమీక్షా సమావేశం నిర్వహించారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ నెల 20 నుంచి 28 వరకు రాష్ట్రపతి నిలయంలో కోవింద్ బస చేస్తారని చెప్పారు.
ఈ నెల 23న తిరువనంతపురం పర్యటనకు వెళ్తారని, తిరిగి 26వ తేదీ సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారని అన్నారు. 27వ తేదీన రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోం’ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 28వ తేదీ మధ్యాహ్నం తిరిగి ఢిల్లీకి రాష్ట్రపతి వెళ్తారని వివరించారు.