telugu navyamedia
రాజకీయ వార్తలు

ఈ నెల 20 నుంచి హైదరాబాద్ లో రాష్ట్రపతి శీతాకాల విడిది

Ramnath president

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిది నిమిత్తం హైదరాబాద్ కురానున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ ఎస్ కే జోషి సమీక్షా సమావేశం నిర్వహించారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ నెల 20 నుంచి 28 వరకు రాష్ట్రపతి నిలయంలో కోవింద్ బస చేస్తారని చెప్పారు.

ఈ నెల 23న తిరువనంతపురం పర్యటనకు వెళ్తారని, తిరిగి 26వ తేదీ సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారని అన్నారు. 27వ తేదీన రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోం’ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 28వ తేదీ మధ్యాహ్నం తిరిగి ఢిల్లీకి రాష్ట్రపతి వెళ్తారని వివరించారు.

Related posts