telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘రాధేశ్యామ్‌’ నుంచి స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది…

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సనిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్ సినిమా షూటింగ్‌లలో పాల్గొననున్నాడు. బాహుబలి తరువాత జాతీయ స్థాయి హీరోగా ప్రభాస్ గొప్ప స్థాయిలో ఉన్నాడు. వెంటనే సాహో అంటూ యాక్షన్ హీరోగా కూడా నిరూపించుకున్నాడు. అయితే ఇటీవల ప్రభాస్ చేసిన తాజా చిత్రం రాధేశ్యామ్. ఇందులో బుట్టబొమ్మ పూజ హెగ్దె హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాధేశ్యామ్ టీజర్ అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుందని వార్తలు వచ్చినా టీజర్ విడుదల కాకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఈ సినిమా టీజర్‌ సంక్రాంతికి వస్తుందని అనుకున్న అభిమానులు టీజర్ రాకపోవడంతో అసహనం ప్రకటిస్తూ ప్రొడక్షన్ బ్యానర్‌ను ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఇవాళ రాధేశ్యామ్‌ మూవీ నుంచి అప్డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా ప్రీ-టీజర్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. “మీకు తెలిసిన మనిషి ఇతడు.. ఈ సారి అతడి హృదయాన్ని తెలుసుకుందాం” అంటూ రెబల్‌స్టార్‌ నడిచివస్తోన్న వీడియోని రిలీజ్‌ చేసింది. ఇంకా పూర్తి స్థాయి ఫస్ట్‌ గింప్స్‌ను ఫిబ్రవరి 14న రిలీజ్‌ చేస్తామని ప్రకటించింది. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌లో సందడి మొదలైంది.

Related posts