సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, అందాల భామ రాఖి ఖన్నా ప్రధాన పాత్రలలో మారుతి తెరకెక్కించిన చిత్రం “ప్రతి రోజు పండగే”. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. డిసెంబర్ 20న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా చిత్రానికి సంబంధించిన సాంగ్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. టైటిల్ సాంగ్కి మంచి రెస్పాన్స్ రాగా, రీసెంట్గా ఓ బావా, తకిట తకిట అనే సాంగ్స్ ను విడుదల చేశారు. పాటలతో పాటు చిత్ర టీజర్ కు కూడా మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఇందులోని సన్నివేశాలు ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. కుటుంబ పెద్ద పాత్రలో, క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ ఉన్న వ్యక్తి పాత్రని పోషించారు సత్యరాజ్. ఇక ఆయన కన్న కలలని సాకారం చేసే పాత్రలో సాయిధరమ్ నటించారు. తేజూ తండ్రిగా రావు రమేష్ అలరించనున్నారు. ట్రైలర్ చూస్తుంటే పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం హిట్ అందుకోవడం ఖాయమని అంటున్నారు నెటిజన్లు.
“బిగ్ బాస్”పై గీతా మాధురి కామెంట్స్