telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్‌తో కేజీఎఫ్‌ డైరెక్టర్‌ చేసేది ఆ సినిమానే !

Prabhas

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తన తరువాతి సినిమా ఎవరితో చేస్తారన్న సందేహం కన్నా ప్రభాస్‌తో చేయనున్నాడన్న పుకార్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తయిన వెంటనే ఆదిపురుష్‌కు సిద్దం కానున్నాడు. అదేవిధంగా ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్2 చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నాడు. అయితే వీరిద్దరి కాంబో సినిమా వస్తుందని వార్తలు మాత్రం ఏమాత్రం జోరు తగ్గించడం లేదు. ప్రభాస్‌కి ప్రశాంత్ ఇప్పటికే కథను చెప్పాడని అది నచ్చడంతో ప్రభాస్ వెంటనే ఓకే చెప్పాడని అన్నారు. అయితే కేజీఎఫ్ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ సోమవారం కీలక ప్రకటన చేసింది. వారి ప్రోడక్షన్‌లో మరో పాన్ ఇండియా సినిమా వస్తుందని దానికి సంబందించిన వివరాలు డిసెంబరు 2న మధ్యహ్నం 2గంటలకు ప్రకటిస్తామని తెలిపింది. దాంతో అది కచ్చితంగా ప్రబాస్, ప్రశాంత్ కాంబోనే అని అభిమానులు అనుకుంటున్నారు. అంతేకాకుండా కన్నడలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉగ్రమ్’ అనే చిత్రాన్నే ఇప్పుడు ప్రభాస్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో రీమేక్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. ఉరు సంవత్సారాల క్రితం వచ్చిన ఈ థ్రిల్లర్ సినిమా కొన్ని మార్పులను చేసుకొని ప్రభాస్‌తో తెరకెక్కనుందని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం కోసం వేచి చూడాల్సిందే. వీరి కాంబో కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. భారీ సంచలనాలు సృష్టించే డైరెక్టర్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఈ కాంబోలో సినిమా ఊహకు కూడా అందడంలేదు.

Related posts