telugu navyamedia
రాజకీయ వార్తలు

లోధి గార్డెన్‌లో ప్రణబ్ అంత్యక్రియలు

Pranabh mukarji

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న మృతి చెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్థివదేహం మరికాసేపట్లో ఆయన అధికారిక నివాసానికి చేరుకోనుంది. ప్రణబ్ పార్థివదేహానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తొలుత అంజలి ఘటించనున్నారు. అనంతరం పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తారు.

10-11 మధ్య రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీతోపాటు కేంద్రమంత్రులు, వీఐపీలు నివాళులు అర్పిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజల సందర్శనకు అనుమతి ఇస్తారు. ఒంటి గంటలకు సైనిక గౌరవ వందనం అనంతరం 2 గంటలకు లోధి గార్డెన్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Related posts