కొత్త ఏడాదికి కొత్త లక్ష్యాలు.. ఇది సాధారణం కదా. ఇలాంటివి అందరూ తీసుకుంటుంటారు.. అయితే సాధించేది కొందరే.. అలాగే మన విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఒక కీలక ప్రకటన వెలువరించారు. ఈ సంవత్సరం జరిగే లోక్ సభ ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడనున్నానని ఆయన తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెడుతూ, ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్న వివరాలను త్వరలో తెలియజేస్తానని అన్నారు.
“అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరి మద్దతుతో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను” అని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా, రజనీకాంత్, కమలహాసన్ తర్వాత రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన సినీ ప్రముఖుల్లో ప్రకాష్రాజ్ మూడో వ్యక్తి కావడం విశేషం.