telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కృష్ణవంశీ దర్శకత్వంలో మరాఠీ రీమేక్… రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో…

Ranga

క్రియేటివ్ డైరెక్ట‌ర్‌గా ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ. అయితే ఆయన ఖాతాలో ఈ మధ్య సరైన హిట్ పడలేదు. ఆయన దర్శకత్వం వహించిన “నక్షత్రం” సినిమా ఫ్లాప్ కావడంతో చాలా రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు మళ్ళీ త‌న త‌దుప‌రి సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఎలాగైనా మంచి హిట్ కొట్టాల‌నే ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ క‌థ‌ను సిద్ధం చేస్తున్నార‌ట ఈయ‌న‌. కృష్ణ‌వంశీ త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ విష‌యంలో ఇన్నాళ్ళు సైలెంట్‌గా ఉన్నాడు. బుధ‌వారం త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చారు ఈ క్రియేటివ్ డైరెక్ట‌ర్‌. నటసామ్రాట్ అనే మరాఠీ సూపర్ హిట్ సినిమాను తెలుగులో రీమేక్ గా చేయబోతుండ‌గా, ఈ సినిమాకి తెలుగులో ‘రంగమార్తాండ’ అని టైటిల్ ను పెట్టారు. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను విడుదల చేసింది. ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను తెలుగు రీమేక్‌లో ప్రకాష్ రాజ్ చేస్తుండగా ఆయ‌న సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. అవికాగోర్ ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. కృష్ణ వంశీ, రమ్య‌కృష్ణ తొలిసారి 1998లో చంద్ర‌లేఖ సినిమా కోసం ప‌నిచేశారు. మ‌ళ్ళీ 20 ఏళ్ళ త‌ర్వాత వారిద్దరు ఈ ప్రాజెక్ట్ కోసం క‌లిసి పని చేయ‌నుండ‌డం విశేషం.

Related posts