పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న చిత్రం ‘సలార్. ఈ సినిమా అప్డేట్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇండిపెండెన్స్డే రోజున చిత్ర యూనిట్ గుడ్న్యూస్ చెప్పింది.
సలార్ రిలీజ్ డేట్ను ప్రకటించి ఫ్యాన్స్లో జోష్ నింపింది. భారీ బడ్జెట్తో పాన్ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
కేజీఎఫ్2 తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ను రిలీజ్ చేశారు.
ఇందులో ప్రభాస్ కొత్త లుక్లో దర్శనమివ్వనున్నారు. శ్రుతీ హాసన్ ఇందులో హీరోయిన్గా నటిస్తుండగా, జగపతిబాబు కీలక పాత్రను పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.