telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘లూసిఫర్’ రీమేక్ వెనుక ప్రభాస్ హస్తం… ఆవిధంగా ముందుకు…

chiranjeevi-prabhas-and-ram-charan

మోహన్‌లాల్ హీరోగా మలయాళంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి హీరోగా నటించనున్నారు. ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మించనున్నారు. నిజానికి ‘లూసిఫర్’ రీమేక్ రైట్స్ కొనుగోలు చేయమని చరణ్, చిరంజీవిలకు ప్రభాస్ సలహా ఇచ్చారని టాక్. ఆయన సూచన మేరకే చరణ్ ‘లూసిఫర్’ రీమేక్ రైట్స్ కొనుగోలు చేశాని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు, ఈ సినిమా దర్శకత్వ బాధ్యతను సుజీత్‌కు అప్పగించమని సలహా ఇచ్చింది కూడా ప్రభాసేనట. ప్రభాస్, సుజీత్ కలిసి ‘సాహో’ సినిమాకు పనిచేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించారు సుజీత్. ‘లూసిఫర్’ పొలిటికల్ డ్రామానే అయినప్పటికీ ఈ సినిమాలోనూ యాక్షన్‌కు పెద్దపీట వేశారు. అందుకే, సుజీత్ అయితే న్యాయం చేస్తాడని ప్రభాస్ చెప్పారట. దీనిపై చరణ్, చిరంజీవి ఆలోచించి మొత్తానికి స్క్రిప్ట్‌ను సుజీత్ చేతిలో పెట్టారని అంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. ‘ఆచార్య’ సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాతే లూసిఫెర్ మొదలు పెట్టె అవకాశం వుంది.

Related posts