పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘రాధేశ్యామ్. మార్చి 11న పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను విడుదల చేస్తున్నారు.. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేరోజు విడుదల కానుంది ఈ చిత్రం. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్స్టోరిగా తెరకెక్కుతుంది.
ఈ క్రమంలో ప్రమోషన్స్ కూడా వేగవంతం చేశారు. గత మూడు నాలుగు రోజులుగా ప్రభాస్, పూజా చిన్నా పెద్దా అని తేడా లేకుండా అన్ని మీడియా ఛానెల్స్ , వెబ్ సైట్స్కు గ్యాప్ లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఫ్యాన్స్ది అమ్మలాంటి ప్రేమ ఆడియో వేదికలపై ఫ్యాన్స్ గురించి మాట్లాడమని చాలామంది చెబుతుంటారు. ఎవరన్నా ప్రశ్నలు అడిగితే మాట్లాడగలను కానీ.. వేదికపై మాట్లాడలేను. అందుకే ఫ్యాన్స్ గురించి ఏం మాట్లాడలేకపోతున్నా. కానీ అభిమానులకు నేనెంటో తెలుసు. వారు నాపై అమ్మలాంటి ప్రేమ చూపిస్తారని తెలిపారు.
అలాగే..’బాహుబలి 1 సినిమాకు విపరీతమైన ప్రమోషన్స్ చేశాం. అప్పటి నుంచి ప్రమోషన్స్ అంటే కొంత జంకు తగ్గింది. ఒకసారైతే దీపికా పదుకొనే నువ్వు ఎక్కువ మాట్లాడవంట కదా? అని అడిగింది. నాకు స్టార్టింగ్ ప్రాబ్లమ్.. కాస్త పరిచయం అయితే ఎక్కువ మాట్లాడతానని చెప్పాను. దీపికా యాటిట్యూడ్ అంటే ఇష్టం, పర్సనల్గా కూడా ఆమెంటే చాలా ఇష్టం. నా లైఫ్లో బాహుబలి మూవీతో మ్యాజిక్ జరిగింది. ఇప్పుడు ఆదిపురుష్ చేయబోతున్నా, నా జీవితంలో ఎక్కువ భయపడింది ఈ సినిమాకే!’ అని చెప్పుకొచ్చాడు.
ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా ప్రభాస్ కనిపించనున్నారు. దాదాపు రూ.300కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ, జగపతిబాబు, మురళీ శర్మ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మిస్తున్నారు.