యంగ్ రెబల్ శస్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా మూవీలలో దూసుకుపోతున్నారు. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. ఈ మూవీతో సౌత్లోనే కాకుండా.. నార్త్ లోనూ ఫుల్ ఫాలోయింగ్ సంపాందించుకున్నాడు.
ప్రస్తుతం ప్రభాస్తో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ డైరెక్టర్స్ పాటుగా.. కోలీవుడ్, బాలీవుడ్ డైరెక్టర్స్ సైతం మొగ్గు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో చేస్తున్న సినిమాలన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం.
ఇప్పటికే రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఆదిపురుష్ షూటింగ్ ని కూడా పూర్తి చేసిన ప్రభాస్ ప్రస్తుతం సలార్ షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇక ఈ సినిమా తరువాత అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.
డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ మూవీ చేయనున్నాడు. ప్రభాస్ 25వ సినిమాగా, పాన్ ఇండియా స్థాయిలో భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ఆదిపురుష్ నిర్మాత భూషణ్ కుమార్ క్రేజి అప్డేట్ రివీల్ చేశారు. ‘స్పిరిట్తో మొట్ట మొదటిసారి ప్రభాస్ పవర్ఫుల్ పోలీసాఫీసర్ కనిపించబోతున్నాడు.
దీంతో ప్రభాస్ అభిమానులు పోలీస్ రోల్లో తమ డార్లింగ్ను చూసుకోవాలని ఎప్పటినుంచో ఆరాటపడుతున్నారు. దీంతో ఫ్యాన్స్ కి ఇక పునకాలే. అయితే ఈ షూటింగ్ ఎప్పడనేది త్వరలో ప్రకటించే అవకాశముంది.