యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెషల్ డ్యాన్స్తో అలరించనుంది. బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. “బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలవుతుండడంతో అన్ని ప్రాంతాల్లోనూ ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నాడు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెండితెరపై ముద్దు సీన్ల గురించి ప్రభాస్కు ప్రశ్న ఎదురైంది. దానికి ప్రభాస్ స్పందిస్తూ.. “ముద్దు సీన్లలో నటించడం నాకు చాలా కష్టం. నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. సినిమాల్లో అలాంటి సీన్లు చేయాల్సి వస్తే చాలా ఇబ్బంది పడతాను” అని ప్రభాస్ చెప్పాడు. అనుష్కతో మళ్లీ ఎప్పుడు నటించబోతున్నారు అని అడగ్గా ఆయన స్పందిస్తూ… “సాహో’ తర్వాత ‘జిల్’ డైరెక్టర్ రాధాకృష్ణ చేస్తున్నానని.. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా చేస్తోందన్నారు.. గతంలో అనుష్కతో ‘బాహుబలి’, ‘మిర్చి’, ‘బిర్లా’లో నటించాను.. అయితే మళ్లీ ఇద్దరం కలిసి ఎప్పుడు కలిసి నటిస్తామో తెలియదు” అని తెలిపారు.
previous post
next post