telugu navyamedia
సినిమా వార్తలు

ఈరోజును జీవితంలో మర్చిపోలేను : ప్రభాస్

Prabhas

“బాహుబ‌లి” సినిమాల‌తో దేశ‌వ్యాప్తంగానే కాకుండా అంత‌ర్జాతీయ స్థాయిలో కూడా నటుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌. దీంతో దేశ‌వ్యాప్తంగా ప్ర‌భాస్‌కు మార్కెట్ ఏర్ప‌డింది. “బాహుబ‌లి-2” సినిమా విడుద‌లై ఆదివారంతో రెండేళ్లు పూర్తి అయ్యాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌భాస్ ఆదివారం సాయంత్రం ఫేస్‌బుక్ ద్వారా ఆ సినిమా గురించి స్పందించాడు. “రెండేళ్ల క్రితం ఇదే రోజున “బాహుబ‌లి: ది కంక్లూజ‌న్‌” సినిమా విడుద‌లైంది. ఈ రోజును జీవితంలో ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి, చిత్ర యూనిట్ మొత్తానికి రుణ‌ప‌డి ఉంటాను. ఎప్పుడూ నా వెన్నంటే ఉంటున్న అభిమానులంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. ప్రోత్సాహం అందిస్తూ పెద్ద విజ‌యం అందించినందుకు ధన్య‌వాదాలు” అంటూ ప్రభాస్ పోస్ట్ చేశాడు. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం “సాహో” చిత్రంలోనూ, డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమాలోనూ నటిస్తున్నారు.

Related posts