“సాహో” తరువాత ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రంగా కెకె రాధా కృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం 1970 బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో రూపొందుతున్నట్టు సమాచారం. ఇక బాలీవుడ్ లో సూపర్ స్టార్డమ్ సంపాదించుకున్న ఒకే ఒక్క దక్షిణాది హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ నటించిన `సాహో` సినిమా మిగిలిన అన్ని భాషల్లోనూ పరాజయం పాలైనా.. బాలీవుడ్లో మాత్రం హిట్ అనిపించుకుంది. భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించింది.కాగా “సాహో” చిత్ర రిలీజ్ సమయంలో మేకర్స్ కాంటెస్ట్ నిర్వహించగా, అందులో విజేతగా నిలిచిన వారు ప్రభాస్ని కలిసే ఛాన్స్ పొందుతారని చెప్పారు. ఇందులో భాగంగా కాంటెస్ట్ విన్నర్స్ ప్రభాస్ని కలిసి ఆయనతో ఫోటోలు దిగారు. ప్రభాస్ని లైవ్లో చూసిన అభిమానుల ఆనందం అవధులు దాటింది.
Rebel Star #Prabhas meets fans/winners of a contest hosted during the release of #Saaho pic.twitter.com/QQRsdeBgvB
— BARaju (@baraju_SuperHit) 11 December 2019
అసభ్యపదజాలంతో రేణూదేశాయ్ పై మండిపడ్డ నెటిజన్