telugu navyamedia
సినిమా వార్తలు

జపాన్ కు ప్రభాస్, అనుష్క జంట ప్రయాణం

prabhas-and-anushka

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క మధ్య ప్రేమాయణం నడుస్తోందని చాలా కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ ప్రభాస్, అనుష్క మాత్రం తామిద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉందంటూ ఆ వార్తలను కొట్టిపారేస్తున్నారు. అయితే తాజాగా ప్రభాస్, అనుష్క జంటగా జపాన్ వెళ్లనున్నారట. అయితే వీరిద్దరూ కలిసి అక్కడ సరదాగా గడపడానికే వెళ్తున్నారంటూ కొన్ని వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే నిజానికి వీరు జపాన్ కు వెళ్ళేది మాత్రం అక్కడ విడుదల కాబోతున్న జపాన్ వెర్షన్ “మిర్చి” సినిమా ప్రమోషన్స్ కోసమేనట.

“బాహుబలి” తరువాత ఈ జంట జపాన్ లో కూడా బాగా పాపులర్ అయ్యింది. అందుకే అంతకుముందే ప్రభాస్, అనుష్క కాంబినేషన్ లో తెరకెక్కిన “మిర్చి” సినిమాను అక్కడ విడుదల చేస్తున్నారట. మార్చి 2వ తేదీన జరగనున్న ఈ సినిమా స్క్రీనింగ్ కోసం ప్రమోషన్ లో పాల్గొనాలంటూ అక్కడి డిస్ట్రిబ్యూటర్ పంపిన ఆహ్వానం మేరకే ఈ ఇద్దరూ అక్కడికి వెళ్లనున్నారట. త్వరలోనే ప్రభాస్ నటించిన “డార్లింగ్” సినిమాను కూడా అక్కడ విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

Related posts