పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. వాటిల్లో రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, నాగ్ అశ్విన్ చిత్రం, సందీప్ వంగ డైరెక్షన్లో మరో చిత్రం వంటి భారీ ప్రాజెక్టులతో సిద్ధంగా ఉన్నాడు.
ఇందులో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రం ‘ఆదిపురుష్’ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నాయి. పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ను త్రీడీలోనూ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం రాముడి పాత్రలో నటిస్తున్న ప్రభాస్కు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.ఈ షూటింగ్ను వచ్చే నెలాఖరుకు పూర్తి చేయాలని భావిస్తున్నారు బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్. రావణ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్, సీత పాత్రధారి కృతి సనన్ ఇప్పటికే తమ పాత్రలను పూర్తి చేసుకున్నారు.
వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ఇప్పటికే వెల్లడించింది చిత్రబృందం. అందుకు తగ్గట్లే షూటింగ్ను పూర్తి చేసే పనిలో పడింది. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించడానికి ముందే రెబల్స్టార్కు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేయాలని భావిస్తున్నాడు. భారీ వీఎఫ్క్స్తో రూపొందుతోన్న ఈ సినిమా అనుకున్న సమయానికి థియేటర్లకు రావాలంటే వీలైనంత తొందరగా షూటింగ్ పూర్తి చేయాలని యూనిట్ భావిస్తోంది.
ఇదిలా ఉంటే ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధే శ్యామ్ విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి.
యాంకర్ శ్యామలాకు ఆర్జీవీ అంతమాటానేశాడేంటి..?