పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్లో.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత ఏ. ఏం.రత్నం ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ నటిస్తున్న 27వ సినిమా ఇది. ‘ఖుషి’, ‘బంగారం’ సినిమాల తర్వాత పవన్, ఏ. ఎం.రత్నం కలయికలో రూపొందుతున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం.పీరియాడికల్ డ్రామాగా భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ సరసన నటించే హీరోయిన్ ఈమే అంటూ పలువురు కథానాయికల పేర్లు వినిపించాయి. క్రిష్, ప్రగ్యా జైస్వాల్ని ఫిక్స్ చేసాడని వార్తలు వచ్చాయి. తాజాగా కీర్తి సురేష్ని ఎంపిక చేశారు. ‘అజ్ఞాతవాసి’ తర్వాత కీర్తి, పవన్తో రెండోసారి రొమాన్స్ చేయనుంది.క్రిష్, ఈ సినిమాలో పవర్ స్టార్ని ఓ కొత్త తరహా పాత్రలో ఆవిష్కరించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ సినిమాకి ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం అందించనున్నారు.
previous post
next post